తెలంగాణా హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ సన్న బియ్యం పథకం కూడా పక్కదారి పడుతుంది.
అవసరం లేని కొందరు అనర్హులు రేషన్ కార్డులు పొంది ప్రభుత్వం అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో అందిస్తున్న సన్నబియ్యాన్ని సైతం బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న పరిస్థితి. దీంతో ప్రభుత్వ లక్ష్యం మరో మారు నీరు కారుతోందని స్పష్టమఉంటోంది.
నిఘ కఠిన తరం కాకపోవడమే ఇలా జరగడానికి కారణమని, పేదలు కాని వారు, కొంతమంది చేసే తప్పిదం వ్యవస్థకు మచ్చ తీసుకువస్తుందనీ ప్రజలు వాపోతున్నారు.
చట్టాలు కఠిన తరం చేసి అక్రమార్కుల ఆటలు కట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
