న్యాయవాద నాయకుడి విజయానికి అభినందనలు
హుజూర్నగర్ నియోజకవర్గంలోని అమరవరం గ్రామంలో జన్మించిన సాముల రామిరెడ్డి న్యాయవాద వృత్తిని అభ్యసించి హుజూర్నగర్ బార్ అసోసియేషన్ లో సభ్యుడిగా చేరి న్యాయవాద వృత్తిని ప్రారంభించి హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా న్యాయవాద నాయకుడిగా 20 ఏళ్ల పాటు నిరాటంకంగా అధ్యక్షుడిగా కొనసాగి 2026 బార్ కౌన్సిల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం నేనున్నానంటూ తాను గతంలో చేసిన సేవలు ఊటంకిస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఇచ్చిన మాట నమ్మి ఓటు వేయగ నేటి ఫలితాలలో విజయం సాధించిన సాముల రామిరెడ్డిని నేరేడుచర్ల న్యాయవాద దంపతులు సుంకర క్రాంతి కుమార్, ప్రదీప్తి లు అభినందించారు.
నిజమైన న్యాయవాద నాయకుడిని గెలిపించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.
